Indigo Airlines: దేశంలో పలు ఎయర్ పోర్టులను పేల్చేస్తామని వచ్చిన మెయిల్ కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చివేస్తామంటూ అగంతకులు, ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్స్ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రత దళాలు 5 ఎయిర్ పోర్ట్ లలో క్షణ్నంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తుున్నాయి.
బుధవారం వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. “విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందరు ప్రయాణీకులు సురక్షితంగా దింపారు. అన్ని తప్పనిసరి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం కార్యకలాపాలకు విడుదల చేయబడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు.