E-Paper
Advertisement

Argument In Bengaluru: బెంగళూరులో వాగ్వాదం తర్వాత ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్

Argument In Bengaluru: బెంగళూరులో వాగ్వాదం తర్వాత ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Advertisement

Argument In Bengaluru: చిన్న గొడవలే తీవ్ర వాగ్వాదానికి దారితీసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ రేజ్ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల తమ కారుకు బైక్ తగిలించాడనే కారణంతో ఓ యువకుడిని ఓ దంపతులు హత్య చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ క్యాబ్ డ్రైవర్ తన కారుతో మోటార్ బైకును ఢికొట్టాడు.

Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Advertisement

వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో కేఆర్ పురం వంతెన సమీపంలో జరిగిన ఈ ఘటనలోఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న బైక్ అనుకోకుండా క్యాబ్‌ను ఢీకొట్టడంతో ఘర్షణ ప్రారంభమైంది. దీంతో డ్రైవర్‌కు, రైడర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.ఈ ఘటన జరుగుతుండగా వెనకాల మరో కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయిన ఫుటేజ్‌లో బైకర్ ఫ్లైఓవర్‌పై క్యాబ్ పక్కన ఆగి డ్రైవర్‌కు సైగ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది సమాయం తర్వాత, క్యాబ్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా తన కారును మోటార్‌సైకిల్‌లోకి దూసుకెళ్లినట్లు వీడియోలో చూడొచ్చు. దీంతో ఇద్దరు రైడర్లు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్, కారు దిగి బైకర్లతో వాదిస్తూ బైక్ నుండి కీని లాక్కున్నాడని ఎక్స్‌లో ఓ యూజర్ పేర్కొన్నాడు. అయితే ఇద్దరు మైనర్ దెబ్బలతో బయటపడ్డారని సమాచారం.

ఈ ఘటనపై బెంగళూరు పొలీసులు స్పందిస్తూ.. ఈ వీడియోను సుమోటాగా తీసుకొని క్యాబ్ డ్రైవర్ పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. చిన్న చిన్న గొడవలకు ఇలా స్పందించే కారు డ్రైవర్లకు బుద్ది చెప్పాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

Advertisement

 

 

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×