E-Paper
Advertisement

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..

Maoists Encounter In Chhattisgarh: మరోసారి దండకారణ్యం రక్తసిక్తమైంది. తుపాకీ తూటాలతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు భీకర పోరు జరిగింది. డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, మూడు జిల్లాల ఎస్టీఎఫ్ సంయుక్త బలగాలు నక్సల్స్ వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. దీంతో వారికి మావోయిస్టులు తారసపడగా ఇరువర్గాలు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోలు హతమైనట్లు అధికారులు పేర్కొన్నారు..

కొన్ని మీడియా కథనాల ప్రకారం, నక్సల్ ప్రభావిత నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా దళాలు కొత్త క్యాంపును ప్రారంభించాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో మావోలు కలత చెందారని.. అబుజ్మద్ ప్రాంతంలో అగ్రనేతలు గుమిగూడారని సమాచారం అందుకున్న బలగాలు సోదాలు నిర్వహించాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×