E-Paper
Advertisement

CJI DY Chandrachud: అనవసర విషయాలపై దృష్టి పెడుతోన్న దర్యాప్తు సంస్థలు.. సీజేఐ చంద్రచూడ్

CJI DY Chandrachud: అనవసర విషయాలపై దృష్టి పెడుతోన్న దర్యాప్తు సంస్థలు.. సీజేఐ చంద్రచూడ్
Advertisement
CJI DY Chandrachud
CJI DY Chandrachud

CJI DY Chandrachud: ప్రస్తుతం దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటీవల కాలంలో అసలు విషయాలు వదిలి కొసరు విషయాలపై దృష్టి పెడుతున్నాయని మండిపడ్డారు.

ప్రస్తుతం దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విస్తరణ దేశంలో జరగాల్సినంతగా జరగలేదని అన్నారు. దాని ఫలితంగా అవి జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలతో ముడిపడిన కేసులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోందని వెల్లడించారు. దేశ రక్షణ, ఆర్థిక స్కామ్ లపై కాకుండా వేరే వాటిపై కేంద్ర దర్యాప్తు దృష్టి సారిస్తోందని విమర్శించారు. దీంతో దేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కేసులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా సీబీఐ వంటి సంస్థలపై అధనపు కేసుల భార పెరుగుతోందని అన్నారు.

Advertisement

సీబీఐ రైజింగ్ డే సందర్భంగా సోమవారం ఢిల్లీలో భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని క్లిష్టమైన కేసుల ఛేదన క్రమంలో అధునాతన సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థలు, జైళ్ల వ్యవస్థ, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Also Read: Rahul Gandhi : రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Advertisement

నేర దర్యాప్తు కేసుల్లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తే చాలా వేగంగా కేసులను పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నుంచి మొదలుకొని కేసు తుది దశకు చేరే వరకు ప్రతీ విషయాన్ని డిజిటలైజ్ చేయడం మంచిదన్నారు. ఈ దిశగా అన్ని కేంద్ర సంస్థలు అడుగులు వేయాలని కోరారు.

Tags

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×