![Saranya Ponvannan latest news](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/SRAVANA.jpg)
Case filed on Raghuvaran Btech Actor Saranya Ponvannan in Police Station: ప్రముఖ కోలీవుడ్ నటిపై కేసు నమోదైంది. కోలీవుడ్, టాలీవుడ్ ల్లో తెరకెక్కిన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేకక్షులకు దగ్గరైన నటి శరణ్య పొన్వన్నన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు పలు చిత్రాల్లో తల్లి పాత్రల్లో చేస్తూ నటి శరణ్య బాగా దగ్గరయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఆమె చెన్నైలోని విరుగంబాక్కంలో నివసిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె పొరిగింట్లో శ్రీదేవి అనే మహిళతో పార్కింగ్ విషయంలో గొడవలు తలెత్తినట్లు సమచారం.
తమని పార్కింగ్ విషయంలో నటి శరణ్య బెదిరిస్తుందని శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి చేసిన ఫిర్యాదు మేరకు శరణ్యపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నటి శరణ్య కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో అమాయకపు తల్లి పాత్రలో నటించి తెలుగు అభిమానులుకు మరింత చేరవయ్యారు. అమాయకపు తల్లి పాత్రలు నటించాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు తనదే అనేలా ముద్ర వేశారు.
Also Read: Pushpa 2 Teaser Date: బ్రేకింగ్.. పుష్ప 2 టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఏప్రిల్..
ఈ సినిమాతో పాటుగా తెలుగులో పలు చిత్రాల్లో ఈమె నటించారు. సూర్యా నటించిన ‘24’, అల్లు అర్జున్ ‘వేదం’, నానీ నటించిన ‘గ్యాంగ్ లీడర్’, సిద్ధార్ద్, శర్వానంద్ కలిసి నటించిన ‘మహాసముద్రం’, ‘ఖుషి’ వంటి చిత్రాల ద్వారా తెలుగులో శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.