
Congress Announced Kadiyam kavya As MP Candidate(TS Politics): వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకోలా స్థానానికి, తెలంగాణలో వరంగల్ స్థానానికి అభ్యర్ధులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
కడియం కావ్య, కడియం శ్రీహరి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ స్థానానికి కడియం కావ్యను ప్రకటించింది. తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాసి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక కాషాయ కండువా కప్పుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తిగా మారింది.
అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్ పోటీ చేయనున్నారు.