BigTV English
Advertisement

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

Cm Siddaramaiah: కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

CM Siddaramaiah : కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ సిద్ధరామయ్యపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.


కేసును విచారించిన న్యాయస్థానం సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాతో, రామలింగారెడ్డి, మంత్రులు ఎంబీ పాటిల్‌ ఉన్నారు. మార్చి 6న ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా కేఎస్‌ ఈశ్వరప్ప పని చేశారు. అప్పట్లో తన సొంత గ్రామంలో జరిగిన పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆరోపించారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.


కర్నాటకలో అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో బసవరాజ్ బొమ్మై తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలోనే రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.

Tags

Related News

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Big Stories

×