BigTV English

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

Cm Siddaramaiah: కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

CM Siddaramaiah : కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ సిద్ధరామయ్యపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.


కేసును విచారించిన న్యాయస్థానం సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాతో, రామలింగారెడ్డి, మంత్రులు ఎంబీ పాటిల్‌ ఉన్నారు. మార్చి 6న ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా కేఎస్‌ ఈశ్వరప్ప పని చేశారు. అప్పట్లో తన సొంత గ్రామంలో జరిగిన పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆరోపించారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.


కర్నాటకలో అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో బసవరాజ్ బొమ్మై తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలోనే రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.

Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×