Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది.కేఏస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వెంకటబ్రహ్మం, కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వెంకటబ్రహ్మం రియల్ఎస్టేట్ వ్యాపారం, భార్య కృష్ణవేణి కోహిర్లోని డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరిగేవి. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో.. ఈ రోజు ఉదయం భర్త వెంకటబ్రహ్మం తన భార్య కృష్ణవేణిని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులోఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.