E-Paper
Advertisement

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Priyanka Gandhi : ఎట్టకేలకు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కేరళలోని వయనాడ్‌ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు తన అన్న రాహుల్ గాంధీ వదిలేసిన స్థానంలో చెల్లెమ్మ పోటీ చేయనుండటంతో కేరళ రాజకీయాలు సైతం కీలక మలుపు తీసుకోనున్నాయి.

నెహ్రూ గాంధీ కుటుంబీకులు దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచే బరిలోకి దిగుతుండేది. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు, రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, తర్వాతి తరం రాహుల్ గాంధీ దాకా అంతా యూపీ ద్వారానే తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేవారు. కానీ తొలిసారిగా రాహుల్ కేరళను ఎంచుకున్నారు.

గతంలో మెదక్ పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు రాహుల్ పూర్తిగా దక్షిణ భారత్ వైపు మళ్లారు. అక్కడ్నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బలం పెంచేందుకు కృషి చేశారు.

అన్న స్థానం చెల్లెలికి… 

ఆ రాష్ట్రంలోని పాలక్కడ్‌, చెళక్కర (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్ పార్లమెంట్’కు నవంబరు 13న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ రాజీనామాతో వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఖాళీ అయిన వయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు.

ఇక పాలక్కడ్‌ నుంచి రాహుల్‌ మామ్‌కుటథిల్‌, చెళక్కర (ఎస్సీ) నుంచి రమ్య హరిదాస్‌ల పేర్లను దిల్లీ అధిష్టానం ప్రకటించేసింది.

Also read : ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం షురూ… నోటిఫికేషన్ ఎప్పుడంటే ?

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×