E-Paper
Advertisement

Congress Record: 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్

Congress  Record: 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్
Advertisement

Congress Record in Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్ల ఓట్లను పొందింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గగా.. హస్తం పార్టీకి ఓట్ షేర్ భారీగా పెరిగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 13. 63 కోట్ల ఓట్లను పొందింది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్టీఏకు మెజారిటీ సీట్లు దక్కడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుకు మరో సారి సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించింది. 1984 లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది.

Advertisement

40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ అత్యధిక ఓట్లు సాధించగా. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా జరిగిన 2024 ఎన్నికల్లో 64.21 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అందులో కాంగ్రెస్ 13.63 కోట్ల ఓట్లను సాధించింది.

ఇదిలా ఉంటే.. గత ఎన్నికల తో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఈ సారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల కంటే బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. అయినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కమలం పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 0.73 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ 1.76 శాతం ఓట్లను అధికంగా సాధించింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×