BigTV English
Advertisement

CM Revanth Reddy: చంద్రబాబు పిలిస్తే వెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: చంద్రబాబు పిలిస్తే వెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో సామరస్యంగానే ముందుకు వెళ్లి రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానంటూ ఆయన గుర్తుచేశారు.


అదేవిధంగా ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం చట్టబద్ధతతో కూడుకున్న హామీ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత చంద్రబాబుతో మాట్లాడుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏపీలో త్వరలో జరగబోయే ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు పిలిస్తే తప్పకుండా వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సామరస్యంగా ముందుకువెళ్తామంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.


అయితే, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుంది. ఇటు వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలిచింది. కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేందుకు కావాల్సిన సీట్లలో కూడా గెలవలేకపోయింది. ఊహించని విధంగా కూటమి అధిక సీట్లు గెలుచుకుంది. దీంతో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ, జనసేన పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఓ పదవిని కూడా ఆఫర్ చేయగా, చంద్రబాబు ఆలోచించి చెబుతానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Big Stories

×