BigTV English

CM Revanth Reddy: చంద్రబాబు పిలిస్తే వెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: చంద్రబాబు పిలిస్తే వెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో సామరస్యంగానే ముందుకు వెళ్లి రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానంటూ ఆయన గుర్తుచేశారు.


అదేవిధంగా ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం చట్టబద్ధతతో కూడుకున్న హామీ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత చంద్రబాబుతో మాట్లాడుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏపీలో త్వరలో జరగబోయే ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు పిలిస్తే తప్పకుండా వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సామరస్యంగా ముందుకువెళ్తామంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.


అయితే, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుంది. ఇటు వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలిచింది. కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేందుకు కావాల్సిన సీట్లలో కూడా గెలవలేకపోయింది. ఊహించని విధంగా కూటమి అధిక సీట్లు గెలుచుకుంది. దీంతో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ, జనసేన పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఓ పదవిని కూడా ఆఫర్ చేయగా, చంద్రబాబు ఆలోచించి చెబుతానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×