E-Paper
Advertisement

Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు

Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు
Advertisement

Rahul Gandhi: ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారత్ మండపంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన వినూత్న నిరసనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. అమెరికా-భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ, ప్రధాని మోడీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ అర్థనగ్న ప్రదర్శన చేయడం పట్ల బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించాలని ఢిల్లీ బీజేపీ పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కృష్ణహరి, బీహార్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుందన్ యాదవ్, యూపీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, మహబూబ్‌నగర్‌కు చెందిన నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్ వంటి కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ వంటి అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆందోళనలు చేపట్టడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని బీజేపీ మండిపడుతోంది. అరెస్టయిన నేతలను పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

అయితే నిన్నటి నుండే ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారత మండపం ఘటనకు నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు రాహుల్ గాంధీ నివాసం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలైన NSUI, యూత్ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అంతర్జాతీయ వేదికల వద్ద రచ్చ చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. దేశాభివృద్ధికి కీలకమైన వాణిజ్య ఒప్పందాలను రాజకీయం చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, ఇలాంటి అనాలోచిత నిరసనలు ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాహుల్ గాంధీ ప్రోద్బలంతోనే ఈ తరహా ఆందోళనలు జరుగుతున్నాయని భావిస్తున్న బీజేపీ, నేరుగా ఆయన నివాసాన్ని ముట్టడించడం ద్వారా తమ నిరసనను ఢిల్లీ వేదికగా బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది. దీంతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

Also Read: ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న‌ వందే భారత్ రైలుపై రాళ్ల దాడి..

ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు యూత్ కాంగ్రెస్ నేతల అరెస్టులు, మరోవైపు బీజేపీ ముట్టడి పిలుపుతో దేశ రాజధానిలో రాజకీయ పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్లమెంట్ లోపల, వెలుపల మరిన్ని వాదోపవాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×