E-Paper
Advertisement

Delhi bomb blast: ఢిల్లీ పేలుడు ఘటన.. కారు డిక్కీలో నిద్రిస్తున్న యువకుడు.. పోలీసులు వెళ్లేసరికే..?

Delhi bomb blast: ఢిల్లీ పేలుడు ఘటన.. కారు డిక్కీలో నిద్రిస్తున్న యువకుడు.. పోలీసులు వెళ్లేసరికే..?

Delhi bomb blast: మూడు రోజుల క్రితం జరిగిన ఎర్రకోట పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో సమీపంలో జరిగిన భయంకరమైన బాంబు పేలుడు ఘటన జరిగిన తరువాత.. ఢిల్లీలోని అన్ని చెక్ పాయింట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో.. సిగ్నేచర్ బ్రిడ్జ్ చెక్ పాయింట్ వద్ద జరిగిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు డిక్కీలో దాచుకున్న యువకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుక నుండి తిరిగి వస్తున్న ఒక కుటుంబానికి చెందిన కారులో, పోలీసులు సాధారణ తనిఖీ చేస్తుండగా.. ఒక వ్యక్తి కారు డిక్కీలో దాక్కుని ఉన్నాడు. యువకుడు నిద్రిస్తూ కనిపించడం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తూర్పు ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఈ కారును ఆపి.. తనిఖీ నిర్వహించారు. ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కారు దిగారు. పోలీసులు వారిని కారు డిక్కీ తెరవమని అడిగారు. కుటుంబ సభ్యులు డిక్కీ తెరవగానే.. లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఈ అనుహ్య దృశ్యం చూసి అక్కడి పోలీసు సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు.

కుటుంబ సభ్యుల వివరణ ఇలా..

అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని నిద్ర లేపి, దీనికి గల కారణాన్ని వివరించమని సీరియస్ గా ప్రశ్నించారు. కారులో చోటు లేకపోవడంతో ఆ వ్యక్తిని డిక్కీలో పడుకోబెట్టి తీసుకురావాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాస్త శాంతించారు. అయితే, పోలీసులు పట్టుకున్నారనే విషయం గ్రహించిన డిక్కీలోని వ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో.. ఢిల్లీ పోలీసులు పెళ్లి నుంచి వస్తున్న ఒక కుటుంబాన్ని ఆపగా, కారులో చోటు లేక మామయ్య కొడుకుని డిక్కీలో పడుకోబెట్టారు’ అని సరదాగా కామెంట్ చేసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. మరొకరు.. ఇలాంటి సమయంలో ఇలా చేస్తే.. కచ్చితంగా ఢిల్లీ పేలుళ్లకు ఘటనకు సంబంధించిన ప్రధాన సూత్రధారి అతనే కావొచ్చని అనుకునేందకు  ఎక్కువగా అస్కారం ఉంటుంది.. అందుకే పిచ్చి పనులు చేయొద్దు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

నవంబర్ 10న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో ఒక కారు పేలడంతో 13 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో కారులో రెండు నుంచి మూడు మంది వ్యక్తులు ఉన్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీలో భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు.

ALSO READ: Government Polytechnic College: ఓరీడి దుంప తెగ.. అన్నంలో కాలు పెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడండి

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×