BigTV English

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal Comments On Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం జైలులో సరెండర్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని విమర్శించారు. ఈవీఎంలను మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.


2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ శనివారం వెలువడ్డాయి. దీంతో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయని కేజ్రీవాల్ ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందన్నారు. బీజేపీ కుట్రలో ఇది కూడా ఓ భాగమే అని మండిపడ్డారు. ఈవీఎంలను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి 350 పైగా స్థానాలు వస్తాయనడంపై  ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్


కాగా, లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటి ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొన్నాయి. ఎల్లుండి రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆరోజు తెలియనున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారం దక్కించుకుంటుంది అనేది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ సరికాదు.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×