E-Paper
Advertisement

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal Comments On Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం జైలులో సరెండర్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని విమర్శించారు. ఈవీఎంలను మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ శనివారం వెలువడ్డాయి. దీంతో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయని కేజ్రీవాల్ ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందన్నారు. బీజేపీ కుట్రలో ఇది కూడా ఓ భాగమే అని మండిపడ్డారు. ఈవీఎంలను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి 350 పైగా స్థానాలు వస్తాయనడంపై  ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

కాగా, లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటి ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొన్నాయి. ఎల్లుండి రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆరోజు తెలియనున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారం దక్కించుకుంటుంది అనేది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ సరికాదు.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×