BigTV English

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal Comments On Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం జైలులో సరెండర్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని విమర్శించారు. ఈవీఎంలను మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.


2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ శనివారం వెలువడ్డాయి. దీంతో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయని కేజ్రీవాల్ ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందన్నారు. బీజేపీ కుట్రలో ఇది కూడా ఓ భాగమే అని మండిపడ్డారు. ఈవీఎంలను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి 350 పైగా స్థానాలు వస్తాయనడంపై  ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్


కాగా, లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటి ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొన్నాయి. ఎల్లుండి రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆరోజు తెలియనున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారం దక్కించుకుంటుంది అనేది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ సరికాదు.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Big Stories

×