E-Paper
Advertisement

Mahua Moitra : మహువా మొయిత్రా ఇంటికి అధికారులు.. అప్పటికే బంగ్లా ఖాళీ చేసిన టీఎంసీ నేత..

Mahua Moitra : మహువా  మొయిత్రా ఇంటికి అధికారులు.. అప్పటికే  బంగ్లా ఖాళీ చేసిన టీఎంసీ నేత..

Mahua Moitra : టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంటిని ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ అధికారుల బృందం అక్కడకు వెళ్లింది. లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహువా మొయిత్రా.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయక తప్పలేదు.

ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బంగ్లా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ (DoE) విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు.అప్పటికే ఆమె బంగ్లాను ఖాళీ చేసి వెళ్లింది.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది.

మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటి పేర్కొంది. పార్లమెంట్ లాగిన్ వివరాలను నిబంధనలను వ్యతిరేకంగా బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చింది. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది.దాంతో ఆమె లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×