E-Paper
Advertisement

Mahua Moitra : మహువా మొయిత్రా ఇంటికి అధికారులు.. అప్పటికే బంగ్లా ఖాళీ చేసిన టీఎంసీ నేత..

Mahua Moitra : మహువా  మొయిత్రా ఇంటికి అధికారులు.. అప్పటికే  బంగ్లా ఖాళీ చేసిన టీఎంసీ నేత..
Advertisement

Mahua Moitra : టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంటిని ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ అధికారుల బృందం అక్కడకు వెళ్లింది. లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహువా మొయిత్రా.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయక తప్పలేదు.

ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బంగ్లా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ (DoE) విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు.అప్పటికే ఆమె బంగ్లాను ఖాళీ చేసి వెళ్లింది.

Advertisement

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది.

మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటి పేర్కొంది. పార్లమెంట్ లాగిన్ వివరాలను నిబంధనలను వ్యతిరేకంగా బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చింది. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది.దాంతో ఆమె లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించారు.

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×