Big Stories

ED Notice To Hemant Soren : సొరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ED Notice To Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఇదే కేసులో ఈనెల 3న సోరెన్‌కు ఈడీ నోటిసులు ఇచ్చింది. అయితే ఆరోజున ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని తెలుపుతూ సీఎం సోరెన్ విచారణకు గర్హైజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది.

- Advertisement -

అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. జులై నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. మిశ్రాకు చెందిన 50 బ్యాంకు అకౌంట్లలో 13.32 కోట్లు సీజ్‌ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News