Big Stories

Shoaib Akhtar Tweet : టీమిండియాకు అక్తర్ సవాల్.. ఒక్క సెమీస్‌కే బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్..

Shoaib Akhtar Tweet : టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశిస్తూ పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్‌ మ్యాచ్‌ కోసం టీమిండియాకు గుడ్‌ లక్‌ చెబుతూనే.. మరో రసవత్తర సమరం కోసం మెల్‌బోర్న్‌లో వెయిట్‌ చేస్తుంటామంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. భారత అభిమానులు అక్తర్‌ ట్వీట్‌పై తగు రీతిలో స్పందిస్తున్నారు.

- Advertisement -

ఏదో అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు చేరిన మీకు అంత బిల్డప్‌ అవసరమా.. కొంచెం ఓపిక పట్టు.. వస్తున్నామంటూ కౌంటరిస్తున్నారు. అప్పుడే ఏమైంది అక్తర్‌.. ఇవాళ ఇంగ్లండ్‌ను ఓడించి, ఫైనల్లో మీ తాట తీస్తామంటూ ఘాటుగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే.. ఫైనల్లో న్యూజిలాండ్‌ అయితే టీమిండియాకు కాస్త ఇబ్బంది అయ్యేదేమో, మీరైతే అస్సలు టెన్షన్‌ పడాల్సి అవసరం లేదు, ఆడుతూ పాడుతూ మీ ఆట కట్టిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News