E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ ఆందోళన.. ఇండియాలో జననాల రేటు తగ్గుదల, గణాంకాలతోపాటు

ఎలాన్ మస్క్ ఆందోళన.. ఇండియాలో జననాల రేటు తగ్గుదల, గణాంకాలతోపాటు
Advertisement

Elon Musk: దేశంలో జనాభా పెంచాలని పదే పదే పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు జనాభా పెంపుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఇద్దరు పిల్లలుంటే చాలనుకునేవారు. ఇప్పుడు ఒక్కరితో సరి పెట్టుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దేశంలో జననాల రేటు పడిపోవడంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియాలో జననాల రేటు తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన

Advertisement

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇండియా వ్యాప్తంగా వైరల్, ఆపై చర్చ కూడా మొదలైంది. భారత్‌లో జననాల రేటు తగ్గుతోందని రాసుకొచ్చారు. జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతి స్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందన్నారు.దీనికి సంబంధించిన గణాంకాల ఫోటోను అందులో జత చేశారు.

భారతదేశ చరిత్రలో సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతి స్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని అందులో ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో ఈ రేటు 2.3 నుంచి 1.9కి పడిపోయిందన్నారు. ఢిల్లీలో సంతాన ఉత్పత్తి రేటు 1.2కి పడిపోయిందన్నారు. ఫిన్‌లాండ్ కంటే చాలా తక్కువని పేర్కొన్నారు.

Advertisement

దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల

భారత దేశ జనాభా త్వరలో పడిపోతుంది బహుశా చాలా వేగంగా అనే శీర్షికతో ఓ పత్రికలో జూన్ 4న ప్రచురించింది. ఓ కథనాన్ని ఏఎఫ్ పోస్ట్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రాసుకొచ్చారు. బాగా చదువుకున్న వారిలో ఈ రేటు చాలా ఏళ్ల కిందటే పడిపోయిందంటూ రాసుకొచ్చారు.

ఇక నార్వే కంటే కేరళ, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంతాన ఉత్పత్తి రేటు కిందికి పడిపోయిందన్నారు. ఇక అమెరికా జనభా కంటే తెలంగాణ దిగువున ఉందని ఆ డీటేల్స్‌లో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ కంటే బంగ్లాదేశ్‌లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. ఇక రాజస్థాన్ 2.3 శాతం, ఉత్తరప్రదేశ్-2.6, బీహార్ -2.8 శాతం ఉందని డేటాను షేర్ చేశారు.

ALSO READ: గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మూడు ప్రశ్నలు, వంట గదులను నాశనం చేసేలా 

గతేడాది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9గా నమోదు అయ్యిందని తెలిపింది. జనాభా అవసరానికి 2.1 స్థాయి కంటే తక్కువని ప్రస్తావించింది. సంతానోత్పత్తి రేటు కంటిన్యూ అయితే భవిష్యత్తులో మునుపటి తరం కంటే చిన్నదిగా మారి దేశ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని విశ్లేషించిన విషయం తెల్సిందే.

జననాల రేటు తగ్గుతున్నప్పటికీ 146 కోట్లకు పైగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతోంది. 2023లో చైనాను అధిగమించి భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. విద్య, పట్టణీకరణ, మహిళలు ఉద్యోగాల్లో చేరడం, మారుతున్న కుటుంబ ప్రాధాన్యతలు వంటి అంశాలు జననాల రేటు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నాయి. దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రసూతి మరణాలు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రస్తావించింది.

 

Related News

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

Big Stories

Advertisement
×