E-Paper
Advertisement

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!
Advertisement

Education Bandh: దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చిన ‘నీట్’ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం సమరశంఖం పూరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, జులై 24న విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

విద్యార్థి సంఘాల ఐక్య పోరాటం

Advertisement

ఈ బంద్ పిలుపునకు రాష్ట్రంలోని ప్రధాన విద్యార్థి, యువజన సంఘాలైన SFI, PDSU, AISA, NSUI, DYFI, AIYF తదితర సంస్థల రాష్ట్ర కమిటీలు ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి రాసే పోటీ పరీక్షలను వ్యాపారంగా మార్చేశారని, లీకేజీల వెనుక ఉన్న పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

Advertisement

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన భారీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అదే విధంగా పేపర్ లీకేజీ వ్యవస్థకు శాశ్వతంగా ముగింపు పలికి, రాబోయే రోజుల్లో పరీక్షలన్నింటినీ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జులై 24 శుక్రవారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా మూసివేసి ఈ బంద్‌లో భాగస్వామ్యం కావాలని విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు , తల్లిదండ్రులు ఐక్యంగా వచ్చి మద్దతు తెలపాలని కోరారు.

Also Read: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

Related News

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Big Stories

Advertisement
×