Maha Kumbamela : కోట్ల మంది భక్తులతో కిక్కిరిసి ఉన్న మహా కుంభమేళలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ -5 లోని టెంట్ల నుంచి ఒక్కసారిగా భారీ అగ్నికీలలు ఎగిసిపడడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద నదీ స్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు తరలివస్తున్నారు. వీరందరికీ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం.. నదీ ఒడ్డున భారీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అక్కడే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు.. మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. టెంట్ లోని భక్తులు వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే.. ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడి భక్తులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏమైందో తెలియక.. పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి దూరంగా పరుగెత్తేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ఉన్న 30కి పైగా టెంట్లు అగ్ని కీలల్లో చిక్కున్నాయి. అవ్వన్నీ పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం. ప్రమాదల నియంత్రణకు, భద్రతకు యూపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన నేపథ్యంలో.. క్షణాల వ్యవధిలోనే అగ్ని ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పేలుడుకు కారణంగా..గ్యాస్ సిలిండర్ గా దాదాపు నిర్థరించి, అగ్ని కీలల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
#WATCH | Fire at #MahaKumbhMela2025 | Prayagraj, UP: Maha Kumbh Mela DIG, Vaibhav Krishna says, "…The fire broke out in tents of Gita Press. There are no reports of any casualties. A survey is being conducted to ascertain the damage caused by the fire. The fire has been brought… pic.twitter.com/4J9lCyr6TU
— ANI (@ANI) January 19, 2025