BigTV English

Fire Accident : బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సజీవదహనం

Fire Accident : బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సజీవదహనం

Fire Accident : ఢిల్లీ-జైపూర్ హైవే పై బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమవ్వగా.. 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 31లోని ఫ్లై ఓవర్ పై రాత్రి 9 గంటలకు ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఝార్సా ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. తీవ్రంగా గాయపడిన వారిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారని.. ఏసీపీ వరుణ్ దహియా తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నామని తెలిపారు. ప్రమాదం కారణంగా.. అక్కడ ట్రాఫిక్ జామ్ అవకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. మృతుల భౌతికకాయాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించలేకపోయామని తెలిపారు. గుర్గావ్ సెక్టార్ 12 నుంచి ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో అధికంగా కూలీలే ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×