E-Paper
Advertisement

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?
train

Rail: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. B1, B2 రెండు ఏసీ కోచ్ లకు మంటలు వ్యాపించాయి. భారీగా పొగ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను చల్లార్చారు.

ఇలా ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల.. ఒకే తరహా ప్రమాదాలు జరగడం కాకతాళీయమా? అనుమానాస్పదమా? అనే కోణంలో విచారిస్తున్నారు రైల్వే అధికారులు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×