E-Paper
Advertisement

Congress: డిక్లరేషన్లు, సభలు.. ఖర్గే, ప్రియాంక, సోనియా హాజరు.. కాంగ్రెస్ దూకుడు

Congress: డిక్లరేషన్లు, సభలు.. ఖర్గే, ప్రియాంక, సోనియా హాజరు.. కాంగ్రెస్ దూకుడు
revanth reddy

Congress: ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ నిర్వహించాలని కాంగ్రెస్ కీలక సమావేశంలో నిర్ణయించారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేయనున్నారు.

ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. సోమవారం నుంచి ఈనెల 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పారు.

ప్రతీ గడపకు చేరాలి.. ప్రతీ తలుపు తట్టేలా చూడాలని రేవంత్ సూచించారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.

ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని.. మేనిఫెస్టో విడుదలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×