BigTV English

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : దేశంలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల యూపీలో గ్యాంగ్ స్టర్ , మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని పోలీసుల సమక్షంలోనే ముగ్గురు యువకులు కాల్చి చంపారు. తాజాగా ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.


లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఓ మహిళను టార్గెట్ చేశాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద కాల్పులు ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ కోసం ఆ మహిళ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇటీవల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి న్యాయవాదిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సాకేత్‌ కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో కాల్పుల ఘటనలు పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×