BigTV English
Advertisement

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : దేశంలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల యూపీలో గ్యాంగ్ స్టర్ , మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని పోలీసుల సమక్షంలోనే ముగ్గురు యువకులు కాల్చి చంపారు. తాజాగా ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.


లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఓ మహిళను టార్గెట్ చేశాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద కాల్పులు ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ కోసం ఆ మహిళ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇటీవల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి న్యాయవాదిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సాకేత్‌ కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో కాల్పుల ఘటనలు పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×