Suresh Kalmadi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పుణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సురేశ్ కల్మాడి రాజకీయ, క్రీడా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలతో పాటు క్రీడారంగంపై ఉన్న మక్కువతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా సుమారు 16 ఏళ్ల పాటు, అలాగే ఆసియా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారు.
Also Read: మార్కాపురం జిల్లాలో దారుణం.. మహిళను కొట్టి చంపి.. AR కానిస్టేబుల్ సూసైడ్
అనారోగ్యంతో మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత pic.twitter.com/neJPTA5wxJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026