Rathasaptami Festival Tiruchanur: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం తిరుచానూర్ పద్మావతి ఆలయం జనవరి 25న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
రథసప్తమి పర్వదినం సందర్బంగా.. పద్మావతి ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అంతకు ముందు వేడుకల్లో భాగంగా జనవరి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కార్యక్రమాల వివరాలు..
జనవరి 25 ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు.
సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని.. శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనము ఉంటుంది.
Also Read: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్జీసీ సంప్రదింపులు
రథసప్తమి పర్వదినాన్ని పురష్కరించుకుని తిరుచానూర్ లో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.