BigTV English

Manipur : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. నలుగురు మిస్సింగ్

Manipur : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. నలుగురు మిస్సింగ్

Manipur : మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో కాల్పులు ఘటన తాజాగా మరోసారి జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరల్లో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు.


గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడం ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్‌లో ఆ నలుగురిపై మిస్సింగ్ కేసు నమోదైంది. చిన్న తుపాకుల నుంచి కాల్పులు జరగడానికి ముందుగా ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి.

అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగింది. అ‍ప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 180 మంది ప్రాణాలను కోల్పోయారు.


ఎస్టీ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండుకు నిరసనగా రష్ర్టంలోని కొండ జిల్లాలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో ఘర్షణలు చెలరేగాయని సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకి గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస ముందు జరగడంతో చిన్న ఆందోళనలకు దారితీసింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×