E-Paper
Advertisement

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

BholeBaba statment: ఉత్తరప్రదేశ్‌లో హాత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా కనిపించకపోవడంపై రకరకాల వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన బాబా నేరుగా మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

భోలెబాబా అలియాస్ సూరజ్‌పాల్ సింగ్ గురించి ఈ మధ్య రకారకాలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వందల కొద్దీ ఆస్తులు కూడబెట్టారని, ఆయనకు ప్రత్యేకంగా ప్రైవేటు సెక్యూరిటీ, కాన్వాయ్ వంటి వ్యవహారా లు బయటపడిన నేపథ్యంలో ఓ న్యూస్ ఏజెన్సీతో నేరుగా మాట్లాడారాయన.

హాత్రాస్‌లో జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు భోలే బాబా. ఇలాంటి సమయంలో ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలన్నారు. ఘటనకు కారణమైన వారు శిక్ష నుంచి తప్పించు కోలేరని, ఈ విషయంలో తనకు ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మృతులు, గాయపడిన కుటుంబా లకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు చెప్పినట్టు వెల్లడించారు.

ఈ ఘటనకు కారణమైన ఈవెంట్ ఆర్గనైజర్, ప్రధాన నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో మధుకర్ పేరును చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం తర్వాత మధుకర్ కనిపించకుండాపోయాడు. శుక్రవారం మధుకర్ పోలీసులకు లొంగిపోవడం, శనివారం బాబా మీడియా ముందు రావడం అంతా చకచకా జరిగిపోయాయి.

ALSO READ: రేఖాశర్మపై కామెంట్స్, బుక్కైన ఎంపీ మహువా మొయిత్రా

జూలై రెండున హాత్రాస్‌లో సత్సంగ్ పేరుతో భోలేబాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఘటన జరిగిన రోజు దాదాపు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏ జరిగిందో తెలీదుగానీ, ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. 121 మంది మృత్యువాతపడ్డారు. గాయపడినవారు అదే రేంజ్‌లో ఉన్నారు.

 

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×