BigTV English
Advertisement

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

BholeBaba statment: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

BholeBaba statment: ఉత్తరప్రదేశ్‌లో హాత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా కనిపించకపోవడంపై రకరకాల వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన బాబా నేరుగా మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


భోలెబాబా అలియాస్ సూరజ్‌పాల్ సింగ్ గురించి ఈ మధ్య రకారకాలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వందల కొద్దీ ఆస్తులు కూడబెట్టారని, ఆయనకు ప్రత్యేకంగా ప్రైవేటు సెక్యూరిటీ, కాన్వాయ్ వంటి వ్యవహారా లు బయటపడిన నేపథ్యంలో ఓ న్యూస్ ఏజెన్సీతో నేరుగా మాట్లాడారాయన.

హాత్రాస్‌లో జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు భోలే బాబా. ఇలాంటి సమయంలో ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు తనకు ఇవ్వాలన్నారు. ఘటనకు కారణమైన వారు శిక్ష నుంచి తప్పించు కోలేరని, ఈ విషయంలో తనకు ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మృతులు, గాయపడిన కుటుంబా లకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు చెప్పినట్టు వెల్లడించారు.


ఈ ఘటనకు కారణమైన ఈవెంట్ ఆర్గనైజర్, ప్రధాన నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో మధుకర్ పేరును చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం తర్వాత మధుకర్ కనిపించకుండాపోయాడు. శుక్రవారం మధుకర్ పోలీసులకు లొంగిపోవడం, శనివారం బాబా మీడియా ముందు రావడం అంతా చకచకా జరిగిపోయాయి.

ALSO READ: రేఖాశర్మపై కామెంట్స్, బుక్కైన ఎంపీ మహువా మొయిత్రా

జూలై రెండున హాత్రాస్‌లో సత్సంగ్ పేరుతో భోలేబాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఘటన జరిగిన రోజు దాదాపు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏ జరిగిందో తెలీదుగానీ, ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. 121 మంది మృత్యువాతపడ్డారు. గాయపడినవారు అదే రేంజ్‌లో ఉన్నారు.

 

Tags

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×