E-Paper
Advertisement

NCP: బాబాయ్ అబ్బాయ్ వరుస భేటీలు.. ఏంటి సంగతి?

NCP: బాబాయ్ అబ్బాయ్ వరుస భేటీలు.. ఏంటి సంగతి?
sharad ajit

NCP news today(Latest breaking news in telugu): మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. NCP అధినేత శరద్‌ పవార్‌తో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మళ్లీ భేటీ అయ్యారు. బాబాయిని అబ్బాయి కలవడం 24 గంటల్లో ఇది రెండోసారి.

ముంబయిలోని శరద్‌ పవార్‌ కార్యాలయానికి అజిత్ వర్గం నాయకులు ముందుగా చేరుకున్నారు. తర్వాత శరద్ పవార్ వచ్చారు. బెంగళూరులో విపక్షాల ఐక్య సమావేశానికి శరద్ పవార్ వెళ్లాల్సి ఉన్నా.. అజిత్‌తో సమావేశం కారణంగా వెళ్లలేదు. అంత ప్రయార్టీ ఇచ్చారాయన.

ఎన్సీపీని ఐక్యంగా ఉంచే విషయంపై ఇద్దరూ చర్చలు జరిపినట్టు చెప్తున్నారు. తమ విన్నపాన్ని విన్న శరద్‌ పవార్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు.

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి బీజేపీ కూటమిలో చేరారు అజిత్ పవార్. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. పార్టీ మాదంటే మాదంటూ రెండు వర్గాలు కీచులాడుకుంటున్న వేళ.. ఆదివారం శరద్‌ పవార్‌తో అజిత్‌ పవార్ సమావేశమయ్యారు. అప్పుడు కూడా పార్టీని ఐక్యంగా ఉంచాలన్న ప్రతిపాదనపైనే చర్చలు జరిగాయి. శరద్‌ పవార్‌ మాత్రం మౌనంగా విన్నారని, ఎలాంటి స్పందనా లేదని తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×