Big Stories

Gujarat AAP : సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్.. గుజరాత్ లో ఆప్ కీలక నిర్ణయం..

Gujarat AAP : ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసినా సంచలనమే. సరికొత్త ప్రయోగాలతో దేశ రాజకీయాలనే మార్చేస్తోంది. పంజాబ్ లో చేసిన ప్రయోగమే.. గుజరాత్ లోనూ అమలు చేస్తోంది. మోదీ సొంతరాష్ట్రంలో ఇప్పటికే ఆప్ దూకుడు మీదుండగా.. తాజాగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ టీవీ యాంకర్ ను ఎంపిక చేసింది.

- Advertisement -

ఇసుధన్ గాడ్వీ.. జర్నలిస్టుగా, టీవీ షో యాంకర్. వీటీవీలో మహామంతన్ న్యూస్ షో కి హోస్ట్ గా పనిచేశారు. కీలక రాజకీయా అంశాలపై చర్చలు నిర్వహించారు.

- Advertisement -

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే.. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గతంగా.. సీఎం క్యాండిడేట్ గా ఎవరిని పెడుదామనే అభిప్రాయ సేకరణ జరిపారు. ఈమెయిలింగ్ పద్ధతిలో జరిగిన ఎంపికలో మొత్తం 73 శాతం మంది.. ఇసుధన్ గాడ్వీకి మద్దతు పలికారు. దీంతో గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీ తరఫున గాడ్వీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

40 ఏళ్ల గాడ్వీ ఏడాది క్రితమే ఆప్ లో చేరారు. అంతలోనే ఆయన ఏకంగా సీఎం అభ్యర్థి అవడం సంచలనంగా మారింది. విషయం తెలిసి గాడ్వీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఓబీసీ వర్గానికి చెందిన ఇసుధన్ గాడ్వీ ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో.. అసెంబ్లీ సంగ్రామం మరింత ఆసక్తికరంగా మారనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News