E-Paper
Advertisement

PM Modi: జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

PM Modi: జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

PM Modi latest speech(Political news telugu): ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు. త్వరలోనే కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని వెల్లడించారు.

జమ్ము కశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్ కు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాతనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తాను ఎప్పుడు ముందు చూపుతోనే ఆలోచిస్తానని తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్ విషయంలో మీరు చూస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమేనని వెల్లడించారు.

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ ను అద్భుతంగా తీర్చిదిద్ధే పనిలో బిజీగా ఉందన్నారు. కశ్మీర్ లో రానున్న రోజుల్లో అందమైన సినిమాలా చూపిస్తామని మాటిచ్చారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం దగ్గరలోనే ఉందన్నారు.

Also Read: Modi open talk: విపక్షాలకు కౌంటర్, కేవలం మూడు శాతమే

జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత.. ప్రజలు ఎమ్మెల్యే, మంత్రులతో నేరుగా మాట్లడే అవకాశం లభిస్తుందన్నారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను స్వయంగా ప్రజాప్రతినిధులతో పంచుకోవచ్చన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదంపూర్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×