E-Paper
Advertisement

Rahul Gandhi: తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ మూవీ జాప్యంపై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi: తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ మూవీ జాప్యంపై రాహుల్ గాంధీ ఫైర్

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక సినిమా విడుదల అంశంగా ప్రారంభమైన ఈ వ్యవహారం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా ఈ వివాదంలోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రవేశించడంతో జన నాయగన్ సెన్సార్ వ్యవహారం జాతీయ స్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటంపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఒక సినిమాపై విధిస్తున్న నిషేధం కాదని, తమిళ అస్తిత్వం, సంస్కృతిపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ ప్రజల గొంతును, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేయలేరని రాహుల్ స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన నేపథ్యంలో.. ఈ చిత్రంలోని రాజకీయ అంశాలు తమకు వ్యతిరేకంగా ఉంటాయనే భయంతోనే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.

మరోవైపు జన నాయగన్ భవిష్యత్తు ఇప్పుడు న్యాయస్థానాల చేతుల్లో ఉంది. ఈ చిత్రానికి వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) జారీ చేయాలని గతంలో మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాజాగా ధర్మాసనం స్టే విధించింది. దీంతో సినిమా విడుదలపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. హైకోర్టు నిర్ణయంతో విస్మయానికి గురైన చిత్ర నిర్మాతలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని, సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో.. ఇందులో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఎలాంటి విమర్శలు ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు స్టేలు, రాజకీయ నేతల మద్దతు వెరసి జన నాయగన్ ఒక సినిమాగా కాకుండా ఒక రాజకీయ ఉద్యమంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ALSO READ: Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×