E-Paper
Advertisement

Kamal Haasan: డ్రాపౌట్ విద్యార్థికి 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం.. నా తల్లి కలను సాధించాను.. రాజ్యసభ ఎంపీ అనుభూతిపై కమల్ హాసన్

Kamal Haasan: డ్రాపౌట్ విద్యార్థికి 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం.. నా తల్లి కలను సాధించాను.. రాజ్యసభ ఎంపీ అనుభూతిపై కమల్ హాసన్

Kamal Haasan: మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల కేరళలో జరిగిన హోర్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్‌కు కమల్ హాజరయ్యారు. కమల్ నటి మంజు వారియర్‌తో కలిసి ఒక సెషన్‌లో పాల్గొన్నారు. అక్కడ సినిమా, రాజకీయాల గురించి మాట్లాడారు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు మీరు ఎలా భావించారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ.. తన తల్లి కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం 71 ఏళ్లకు దక్కిందని అన్నారు.

రాజ్యసభలో సంతకం చేస్తుంటే

రాజ్యసభ ఎంపీ అయినప్పుడు తనకు కలిగిన అనుభూతిపై కమల్‌ మాట్లాడుతూ.. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు డి. శ్రీనివాసన్ అయ్యంగార్, రాజ్యలక్ష్మి గుర్తుకు వచ్చారని చెప్పారు. తాను రాజ్యసభలోకి ప్రవేశించి, సంతకం చేసినప్పుడు మొదట గుర్తుకు వచ్చింది తన తల్లిదండ్రులే అన్నారు. తాను స్కూల్ డ్రాపౌట్, కనీసం SSLC పరీక్షలో ఉత్తీర్ణుడై ఉంటే, రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదని తన తల్లి ఎప్పుడూ చెప్పేదని ఆయన అన్నారు.

నా తల్లికి ఫోన్ చేయాలనుకున్నా

71 ఏళ్ల తర్వాత తన తల్లి కలను సాధించానని, తన గురించి తనకు చాలా గర్వంగా ఉందని, దాని గురించి ఆమెకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నానని కమల్ అన్నారు. “70 ఏళ్ల వయసులో నేను రాజ్యసభలో అడుగుపెట్టాను, నేను ఎంపీగా సంతకం చేశాను, నా రోజువారీ ఖర్చులు నాకు ఇచ్చారు. వెంటనే నేను నా తల్లికి లేదా ఎవరికైనా ఫోన్ చేసి, నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని చెప్పాలనుకున్నాను. నాకు అంత గర్వంగా అనిపిస్తుంది” అని కమల్ హాసన్ అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తనకు గర్వకారణమని కమల్ అన్నారు. తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని కమల్ అన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×