Karnataka Plane Crash: కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఓ ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఈ చిన్న విమానం.. బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళూరు గ్రామ శివార్లలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఒక కెప్టెన్ , ట్రైనీ పైలట్ ఉన్నారు.
విమానం గాలిలో ఉన్నప్పుడే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అది సాధ్యపడక పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. విమానం నేలను బలంగా ఢీకొనడంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
ఈ ప్రమాదంలో కెప్టెన్ ,ట్రైనీ పైలట్ ఇద్దరికీ గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని విమానం నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న బాబలేశ్వర్ పోలీసులు , రెడ్ బర్డ్ ఏవియేషన్ ప్రతినిధులు పరిస్థితిని సమీక్షించారు. విమాన ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు , ఏవియేషన్ నిపుణులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు.
Also Read: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!
కూలిన ప్రైవేట్ విమానం.. కెప్టెన్, ట్రైనీ పైలట్ కు గాయాలు
కర్ణాటకలోని విజయపుర జిల్లా బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళూరు గ్రామంలో కూలిన రెడ్ బర్డ్ ఏవియేషన్ కు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం
ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం
ప్రమాద ఘటనకు సంబంధించిన… pic.twitter.com/NDWZJC9l78
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2026