E-Paper
Advertisement

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!
Advertisement

Srikakulam Robbery: ఇటీవలి కాలంలో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు రక్తాన్ని చెమటగా మార్చి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొత్తును దొంగలు నిమిషాల్లో దోచుకెళ్తున్నారు.

ఇంటికి తాళాలు వేసినా, CCTV లు ఏర్పాటు చేసినా.. కిటికీల నుండో, తలుపులు పగులగొట్టో కేటుగాళ్లు ఎలా వస్తున్నారో, ఏ మార్గంలో మాయం అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగలు పది భారీ దోపిడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement

శ్రీకాకుళం జిల్లాలోని బాలిగాం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒకే వీధిలో వరుసగా ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలను బద్దలు కొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. బాధితులు ఉదయం లేచి చూసేసరికి ఇళ్లలోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం.. బీరువాలు తెరిచి ఉండటంతో షాక్‌కు గురయ్యారు.

ఈ దోపిడీలో దొంగలు భారీ మొత్తంలో నగదు, నగలను అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 తులాల బంగారం, 3 కిలోల వెండి వస్తువులను దుండగులు తీసుకెళ్లారు. వీటితో పాటు బీరువాల్లో ఉన్న కొంత నగదును కూడా దొంగిలించినట్లు సమాచారం. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement

బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read: భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. కీ హైలైట్స్ ఇవే..!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×