E-Paper
Advertisement

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!
Advertisement

Srikakulam Robbery: ఇటీవలి కాలంలో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు రక్తాన్ని చెమటగా మార్చి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొత్తును దొంగలు నిమిషాల్లో దోచుకెళ్తున్నారు.

ఇంటికి తాళాలు వేసినా, CCTV లు ఏర్పాటు చేసినా.. కిటికీల నుండో, తలుపులు పగులగొట్టో కేటుగాళ్లు ఎలా వస్తున్నారో, ఏ మార్గంలో మాయం అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగలు పది భారీ దోపిడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement

శ్రీకాకుళం జిల్లాలోని బాలిగాం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒకే వీధిలో వరుసగా ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలను బద్దలు కొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. బాధితులు ఉదయం లేచి చూసేసరికి ఇళ్లలోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం.. బీరువాలు తెరిచి ఉండటంతో షాక్‌కు గురయ్యారు.

ఈ దోపిడీలో దొంగలు భారీ మొత్తంలో నగదు, నగలను అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 తులాల బంగారం, 3 కిలోల వెండి వస్తువులను దుండగులు తీసుకెళ్లారు. వీటితో పాటు బీరువాల్లో ఉన్న కొంత నగదును కూడా దొంగిలించినట్లు సమాచారం. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement

బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read: భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. కీ హైలైట్స్ ఇవే..!

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×