BigTV English
Advertisement

Arvind Kejriwal: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Arvind Kejriwal: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో శనివారం ఢిల్లీ పోలీసులు బిభవ్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ అంశంపై కేజ్రీవాల్ స్పందించారు. బిభవ్ కుమార్ ను కుట్ర పూరింతంగానే అరెస్ట్ చేయించారంటూ ఆయన ఆరోపించారు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని మండిపడ్డారు. ఇదే సమయంలో బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.


ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీని అణచి వేయలేరని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే సంజయ్ సింగ్ ను జైల్లో పెట్టించిన బీజేపీ ఇప్పుడు బిభవ్ పై కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. రేపు (ఆదివారం) తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని అన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరారు.

మే 19న మధ్యాహ్నం 12 గంటలకు అంతా కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. మోదీ తమ నేతలను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. అందరినీ ఒకే సారి అరెస్ట్ చేయండి అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.


కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె వాంగ్మూలంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ నివాసం వద్ద ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆప్ విడుదల చేసింది. దీనిపై స్వాతి మలివాల్ కూడా ట్విట్టర్ వేదికగా హిట్ మ్యాన్ అంటూ స్పందించారు.

అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు బిభవ్ ను అరెస్ట్ చేయగా..ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్ అని అన్నారు. పేదల కోసం మొహల్లా క్లినిక్ లు, ప్రభుత్వ పాఠశాలలు, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించడం నేరమా.. అందుకేనా మమ్మల్ని జైల్లో వేస్తున్నారు అంటూ నిలదీశారు. ఎంత మంది ఆప్ నేతలను జైల్లో పెట్టినా.. అంతకు వంద రెట్లు ఎక్కువ మందిని దేశం తయారు చేస్తుందని అన్నారు.

 

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×