E-Paper
Advertisement

Lok Sabha Ruckus: ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్‌లో జరిగింది ఇది.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు!

Lok Sabha Ruckus: ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్‌లో జరిగింది ఇది.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు!
Advertisement

Lok Sabha Ruckus: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింద‌ని ఆయన ఆరోపించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు. బడ్జెట్‌పై అర్థవంతమైన చర్చలు జరగాలని తాము కాంగ్రెస్ పార్టీని చేతులు జోడించి మరీ వేడుకున్నామని, కానీ వారు చర్చకు సిద్ధంగా లేరని రిజిజు పేర్కొన్నారు. ప్రతిరోజూ సభ మధ్యలోకి (వెల్) వచ్చి గందరగోళం సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తీరు పార్లమెంట్ గౌరవాన్ని ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి రిజిజు మండిపడ్డారు. ప్రధాని కూర్చునే సీటు వద్దకు వెళ్లి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న దృశ్యాలను ఆయన ఎత్తిచూపారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తమ ఎంపీల తీరుపై కాంగ్రెస్ పార్టీ గర్వంగా ఉందని అనుకుంటుందేమోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభను స్తంభింపజేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. సభా నిబంధనలను అతిక్రమిస్తూ, స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని రిజిజు స్పష్టం చేశారు. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, పార్లమెంట్ విలువలను కాలరాస్తున్నాయని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, లోక్‌సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిని చుట్టుముట్టే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింద‌ని లోక్ స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం పేర్కొంది. లడఖ్ సరిహద్దు అంశంపై ఎం.ఎం. నరవణే పుస్తకంలోని వివరాలు, ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ సభ్యులు నిలదీస్తూ ఈ నిరసన చేపట్టారు. ప్రధానిపై దాడికి ప్లాన్ చేశారనే వార్తలు సంచలనం రేపగా, మాట్లాడే అవకాశం ఇవ్వనందునే నిరసన తెలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంది. ఇది పార్లమెంటరీ చరిత్రలోనే దురదృష్టకరమని అధికార పక్షం మండిపడింది.

Advertisement

Read Also: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. సాయుధ గ్రూపుల ఇళ్లకు నిప్పు, మళ్లీ కర్ఫ్యూ

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×