BigTV English

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.


డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.

గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్ సమావేశమవ్వగా.. మహువాను లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫార్సును ప్యానెల్ కు ఆమోదించింది. దానిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. నివేదికలో పార్లమెంట్ మెంబర్ గా మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, హేయమైనవని, నేరపూరితమైనవని ఎథిక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.


తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×