BigTV English

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.


డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.

గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్ సమావేశమవ్వగా.. మహువాను లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫార్సును ప్యానెల్ కు ఆమోదించింది. దానిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. నివేదికలో పార్లమెంట్ మెంబర్ గా మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, హేయమైనవని, నేరపూరితమైనవని ఎథిక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.


తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×