E-Paper
Advertisement

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.

గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్ సమావేశమవ్వగా.. మహువాను లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫార్సును ప్యానెల్ కు ఆమోదించింది. దానిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. నివేదికలో పార్లమెంట్ మెంబర్ గా మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, హేయమైనవని, నేరపూరితమైనవని ఎథిక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×