E-Paper
Advertisement

NH-45 Red Road: వన్యప్రాణుల రక్షణకు ‘రెడ్ రోడ్డు’.. దేశంలోనే తొలిసారిగా ఎంపీలో.. స్పెషాలిటీ ఏంటంటే?

NH-45 Red Road: వన్యప్రాణుల రక్షణకు ‘రెడ్ రోడ్డు’.. దేశంలోనే తొలిసారిగా ఎంపీలో.. స్పెషాలిటీ ఏంటంటే?

NH-45 Red Road: వన్యప్రాణులను రక్షించడానికి మధ్యప్రదేశ్ జాతీయ రహదారిపై దేశంలోనే తొలిసారిగా ‘రెడ్ రోడ్’ను నిర్మించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిపై టేబుల్‌ టాప్ రెడ్ రోడ్ మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళుతున్న NH-45 రోడ్డుపై 2 కి.మీ. విస్తీర్ణంలో రెడ్ మార్క్స్ ఏర్పాటు చేశారు.

టైగర్ రిజర్వ్ మార్గంలో వాహనాల వేగాన్ని తగ్గించడానికి, డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఈ విధంగా రెడ్ రోడ్డు మార్కింగ్ చేశారు. దీంతో జంతువులు వాహనాలను ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

‘రెడ్ రోడ్’ ఎలా పనిచేస్తుంది?

జాతీయ రహదారిపై కొద్ది ఎత్తున, ఎరుపు రంగు మార్కింగ్ చేస్తారు. ఇది టేబుల్‌ టాప్ రోడ్ మార్కింగ్ ఉంటుంది. సంప్రదాయ స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా కాకుండా, ఈ డిజైన్ డ్రైవర్లు సడెన్ బ్రేకింగ్ లేకుండా సహజంగానే వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. అటవీ మార్గంలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులను అలర్ట్ చేయడానికి స్పష్టమైన సూచికలుగా రెడ్ రోడ్డు పనిచేస్తుందని అధికారులు తెలిపారు.

తరచుగా ప్రమాదాలు

వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ లో తరచుగా పులులు, ఇతర జంతువులు తరచుగా హైవేను దాటుతుంటాయి. దీంతో వేగంగా వచ్చే వాహనాలతో జంతువులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు అధికారులు రెడ్ రోడ్డును ఏర్పాటు చేశారు. సాధారణ రోడ్డు సూచికలు, స్పీడ్ బ్రేకర్లతో పోలిస్తే ఎరుపు రంగు రోడ్డు మార్కింగ్ ప్రమాదాలు తగ్గుతాయని, ట్రాఫిక్ సజావుగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అభివృద్ధి, జంతువుల పరిరక్షణ

మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రెడ్ రోడ్డు చొరవ ఒక ఉదాహరణ అని నెటిజన్లు అంటున్నారు. అటవీ ప్రాంతాలలో వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రెడ్ రోడ్డు ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా అమలుచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: Himalaya Mountain COLLAPSE: హిమాలయాల్లో టైమ్‌బాంబ్.. డేంజర్‌లో భారత్!

రెడ్ రోడ్డు వీడియో బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. వన్యప్రాణులు-మానవ అభివృద్ధి రెండింటికి ఇబ్బంది లేకుండా ఈ తరహా ప్రాజెక్టులు అవసరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×