BigTV English
Advertisement

Wallets, Mobiles Stolen during Roadshow: ‘ర్యాలీలో చేతులు పైకెత్తి జై కొట్టా.. రూ. 36 వేలు మాయం’!

Wallets, Mobiles Stolen during Roadshow: ‘ర్యాలీలో చేతులు పైకెత్తి జై కొట్టా.. రూ. 36 వేలు మాయం’!

Wallets, Mobiles Stolen in Political Roadshow: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార సభలు, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి ఆయా పార్టీలు. అయితే, ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ పాల్గొన్న రోడ్ షోలో జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారు.


అయితే, యూపీలోని మీరట్ లో నిర్వహించిన ఈ రోడ్ షోలో అరుణ్ గోవిల్ తోపాటు రామాయణ్ సీరియల్ లో సీత, లక్ష్మణ్ లుగా నటించిన దీపికా చిక్లియా, సునీల్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గోవిల్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరాము నినాదాలతో హోరెత్తించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది జేబుదొంగలు ఆ రోడ్ షోలోకి చొరబడి పలువురు బీజేపీ నేతలు, విలేకరులు, వ్యాపారవేత్తల ఫోన్లను చోరీ చేశారు. తనకు తన దుకాణం ముందు అరుణ్ గోవిల్ కాన్వాయ్ కనిపించిందని.. దీంతో తను కూడా అక్కడికి వెళ్లి చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశానని.. కొద్దిసేపటి తరువాత తను తన జేబులో చేయి పెట్టగా ఖాళీగా కనిపించిందని.. అందులో ఉన్న రూ. 36 వేలు ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యాపారి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?


బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన వారి నుంచి పలు సెల్ ఫోన్లు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×