Mumbai: ముంబై నడిరోడ్డుపై సామాన్య జనం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు, సామాన్యుడి గొంతు ఎంత బలంగా ఉంటుందో నిరూపించింది. ముంబైలో బీజేపీ నిర్వహించిన ‘మహిళా సంకల్ప ర్యాలీ’ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రద్దీలో చిక్కుకున్న ఒక సాధారణ మహిళ, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ను నేరుగా నిలదీసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
తన బిడ్డను స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్న ఆ మహిళ, గంటల తరబడి వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. ఎండలో, కదలని ట్రాఫిక్లో తన బిడ్డ ఇబ్బంది పడుతుందన్న ఆవేదన ఆమెలో ఆగ్రహాన్ని నింపింది. సరిగ్గా అదే సమయంలో ర్యాలీలో పాల్గొన్న మంత్రి మహాజన్ ఆమెకు కనిపించడంతో.. ఏమాత్రం వెనకాడకుండా ఆయన వద్దకు వెళ్లి నిలదీసింది. ‘మీ రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు ఏవైనా ఉంటే మైదానాల్లో (గ్రౌండ్స్) చూసుకోండి. ఇలా రోడ్ల మీద ర్యాలీలు తీసి సామాన్య ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు?’ అంటూ ఆమె వేసిన ప్రశ్నలకు మంత్రి ఒక్క క్షణం అవాక్కయ్యారు.
సాధారణంగా మంత్రులు కనిపిస్తే భయం భక్తి ప్రదర్శించే కాలంలో, ఒక మహిళ తన హక్కు కోసం, ఎదుటివారి నిర్లక్ష్యంపై విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. వీఐపీ కల్చర్ పేరుతో సామాన్యుల సమయాన్ని వృధా చేసే నాయకులకు ఇదొక హెచ్చరిక లాంటిదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read: అనగనగా ఓ సాఫ్ట్ వేర్.. ఉద్యోగం పోయిందని మేడపై గంజాయి మొక్కలు
మంత్రిపై విరుచుకుపడిన సామాన్య మహిళ!
ముంబైలో బీజేపీ మహిళా సంకల్ప ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్
తన బిడ్డను తీసుకుని రావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయిన ఓ మహిళ
ఆగ్రహానికి లోనై ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్పై అసహనం
‘మీ నిరసనలేవో గ్రౌండ్లో… pic.twitter.com/ZDyme3iT4m
— BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2026