E-Paper
Advertisement

Bihar Floor Test Highlights: బీహార్ ప్రభుత్వ భవితవ్యం తేలేది నేడే.. అసెంబ్లీలో బలపరీక్ష

Bihar Floor Test Highlights: బీహార్ ప్రభుత్వ భవితవ్యం తేలేది నేడే.. అసెంబ్లీలో బలపరీక్ష

Bihar Floor Test Highlight: బీహార్‌ భవితవ్యం తేలేందుకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీలో నేడు విశ్వాస పరీక్ష నిర్వహించనుంది. నేటి విశ్వాస పరీక్షలో నితీశ్‌ కుమార్‌ గెలుస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. బలపరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నితీశ్‌ను ఓడించి, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్​జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తన వ్యూహాలకు పదునుపెడుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న బీహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సొంత గడ్డపై కాలుపెట్టారు. వారంతా ఇవాళ ఓటింగ్‌లో పాల్గొననున్నారు.

మరోవైపు నేడు జరిగే విశ్వాస పరీక్షలో ఎన్​డీఏకు అనుకూలంగా ఓటు వేయాలని హిందుస్థానీ ఆవామ్ మోర్చా నిర్ణయించింది. దీనికి సంబంధించి తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నీతీశ్​ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

Read More: ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రాల ఉద్యోగులకు పండుగే..

మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం నితీశ్‌కు చెందిన జేడీయూకు 45 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 78 మంది, మాంఝీ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 122ను దాటి ఎన్‌డీఏకు 128 ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. మరోవైపు మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలే ఉండగా.. వారెవరూ గీత దాటకుండా ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు కొనసాగించాయి. ఆర్జేడీ సభ్యులంతా ఆ పార్టీ నేత తేజస్వియాదవ్‌ నివాసంలో ఉండగా.. వారం రోజులుగా తెలంగాణలో శిబిరంలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బీహార్‌కు చేరుకున్నారు. బలపరీక్ష అయిపోగానే ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్‌పై ఎన్‌డీఏ పక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×