E-Paper
Advertisement

CM Nitish skips Niti Aayog meeting: నీతి ఆయోగ్ మీటింగ్.. సీఎం నితీష్ డ్రాప్, ఎన్డీయేలో ఏం జరుగుతోంది?

CM Nitish skips Niti Aayog meeting:  నీతి ఆయోగ్ మీటింగ్.. సీఎం నితీష్ డ్రాప్, ఎన్డీయేలో  ఏం జరుగుతోంది?

CM Nitish skips NITI Aayog meeting(Political news telugu): ఎన్డీఏలో ఏం జరుగుతోంది? కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా? బీహార్ సీఎం నితీష్‌కుమార్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ఎందుకు డుమ్మాకొట్టారు? ఇవే ప్రశ్న ఇటు ఎన్డీయే.. అటు ఇండియా కూటమిని  వెంటాడుతోంది.

న్యూఢిల్లీ వేదికగా శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా వికసిత్ భారత్-2047 విజన్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఏం జరిగిందో తెలీదుగానీ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ డ్రాపయ్యారు. బీహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా అటెండయ్యారు.

నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది.

నితీష్ సర్కార్‌ను విపక్ష ఆర్జేడీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సీఎం నితీష్‌కుమార్, ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖాదేవిపై విరుచుకు పడ్డారు. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. పరిస్థితి గమనించిన సీఎం నితీష్ కుమార్ అందుకే దూరంగా ఉన్నారన్నది కొందరి నేతల అభిప్రాయం.

ALSO READ: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

ఇండియా కూటమి నేతలు మాత్రం ఎన్డీయేలో నితీష్‌కుమార్ ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. బీహార్ ప్రజల నాడి తెలిసిన నితీష్‌కుమార్, పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతారని అంటున్నారు. ఈ విషయంలో ఆయనకు తిరుగులేదని చెబుతున్నారు. నిప్పులేనిదే పొగరాదని సీఎం నితీష్‌కుమార్ డ్రాప్ కావడం వెనుక కారణాలు చాలానే ఉంటాయని అంటున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×