Odisha Athletes: ఒడిశాకు చెందిన యువ అథ్లెట్లు రైలులో టాయిలెట్ వద్ద కూర్చొని ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు 18 మంది ఒడిశాకు చెందిన స్కూల్ లెవల్ అథ్లెట్లు.. ఉత్తరప్రదేశ్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వారికి కన్ఫార్మ్ టికెట్లు లేకపోవటంతో జనరల్ కంపార్ట్మెంట్, రైలు మరుగుదొడ్డి వద్ద నేలపై కూర్చొని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ టీమ్ లో మొత్తం 10 మంది బాలురు, ఎనిమిది మంది బాలికలు ఉన్నారు.
తీవ్రమైన చలిలో యువ అథ్లెట్లు రైలు టాయిలెట్ల దగ్గర కూర్చోవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఈవెంట్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను ఇలాగేనా చూసుకునేది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టోర్నమెంట్ పూర్తైన తర్వాత కూడా వారికి ఇబ్బందులు తప్పలేదు. ఒడిశాకు తిరుగు ప్రయాణంలో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పలేదు. అథ్లె్ట్ల ప్రయాణానికి టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో.. ప్లేయర్లు జనరల్ కోచ్లలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. క్రీడాకారులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటు విమర్శిస్తున్నారు.
అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకులను జట్టుతో ప్రయాణించడానికి అనుమతించలేదని సమాచారం. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. యువ అథ్లెట్లు సుదీర్ఘ ప్రయాణాలలో పెద్దల పర్యవేక్షణ లేకుండా ఉండకూడదని నెటిజన్లు అంటున్నారు.
The visuals of 18 young Odisha wrestlers being forced to sit near train toilets in biting cold are a national embarrassment. These athletes were travelling to Uttar Pradesh to represent our state in the national school wrestling championship.
This is the true face of the BJP… pic.twitter.com/unrzPn8uds
— Navajyoti Patnaik (@NavjyotiPatnaik) December 23, 2025
ఈ ఘటనపై ఒడిశాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. తల్లిదండ్రులు, క్రీడా ప్రేమికులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు వస్తున్నప్పటికీ ఒడిశా ప్రభుత్వం ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోతి పట్నాయక్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అథ్లెట్లకు కనీస సౌకర్యాలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. క్రీడలను ప్రోత్సహించడం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుందని తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. యువ అథ్లెట్లకు కనీసం ట్రైన్ టికెట్లు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.