E-Paper
Advertisement

Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..

Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..

Odisha: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రుల్ని పెద్దయ్యాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే వారిపాలిట రాక్షసులు అవుతున్నారు. ఆస్తికోసం కొందరు చంపేస్తుంటే.. ఇంకొందరు లేనిపోని కారణాలు చెప్పి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన పంటలో క్యాలీఫ్లవర్ కోసిన తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడో కసాయి కొడుకు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్లోని సరపసి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉండగా.. వివాహాలు అయ్యాయి. వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు.

చిన్నకొడుకు శతృఘ్న మహంత (39) క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తున్నాడు. కూర వండుకునేందుకు తల్లి ఆ పంట నుంచి ఒక క్యాలీఫ్లవర్ ను కోసుకుంది. అది చూసిన శత్రఘ్న.. తన అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. శత్రుఘ్న తీరుపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనిపై కేసు నమోదైంది.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×