E-Paper
Advertisement

PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..

PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..
PM Kisan 16th Installment Ddate Announced: రైతులకి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 16 వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది. రైతులకు ఆర్దికంగా నిలిచేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మొత్తం 3 విడతలగా 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది.
పీఎం కిసాన్ పథకానికి అర్హులు ఎవరంటే..

పీఎం కిసాన్ పథకానికి రైతులు మాత్రమే అర్హులు.

పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే..

పీఎం కిసాన్ 16వ విడత ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్ 16 వ విడత డిపాజిట్ అయ్యిందా? లేదా? అని ఎలా చెక్ చేసుకోవాలంటే..
1. అర్హులైన రైతులు https://pmkisan.gov.in/portal పీఎం సమ్మాన్ నిధి అధికార పోర్టల్ లోకి వెళ్లాలి.
2. హోమ్ పేజీలో కార్నర్ ను ఎంపిక చేసుకోవాలి.
3. పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
4. ఆధార్ లేదా ఫోన్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
5. గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనబడుతుంది.

Read More: అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!

పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ పథకానికి నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ ని తప్పని సరి చేసుకోవాలి. ఈ కేవైసీ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నేరుగా రైతులకు అందించేల ఈకేవైసీని ప్రవేశపెట్టింది. ఇలా చేయడం వల్ల మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులను డిపాజిట్ చేస్తుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×