E-Paper
Advertisement

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు
Advertisement

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో సైబర్ మోసగాళ్ల చెరలో చిక్కుకున్న భారతీయ పౌరులను రక్షిస్తూ, భారత ప్రభుత్వం మరో సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 270 మంది భారతీయులు, వారిలో తెలంగాణకు చెందిన 12 మంది సైబర్ బాధితులు, గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సమన్వయంతో చేపట్టింది.

విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం.. ఈ బాధితులను అధిక జీతాలతో ఐటీ, డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ మోసగాళ్లు మయన్మార్‌కు పిలిచారు. భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఈ యువకులు.. ఉద్యోగ ఆశతో మయన్మార్ చేరుకున్న తర్వాత మోసగాళ్ల పంజాలో చిక్కుకున్నారు. వారిని బందీలుగా ఉంచి, చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ మోసాలు, సైబర్ స్కామ్ కార్యకలాపాలు చేయాలని బలవంతం చేశారు. తిరస్కరిస్తే శారీరక హింస, పాస్పోర్టులు స్వాధీనం, బయటికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేసినట్లు బాధితులు వెల్లడించారు.

Advertisement

ఈ సైబర్ మోసగాళ్ల గూళ్లు ప్రధానంగా మయన్మార్ – థాయిలాండ్ సరిహద్దు ప్రాంతంలోని లావోస్, మయావాడీ, కయిన్ రాష్ట్రం వంటి ప్రాంతాల్లో ఉన్నాయని సమాచారం. అక్కడ పెద్ద ఎత్తున చైనీస్ మాఫియా సంస్థలు అక్రమ సైబర్ నెట్వర్క్‌లు నిర్వహిస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. వారి వద్ద బలవంతంగా పనిచేస్తున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో భారత రాయబార కార్యాలయాలు, స్థానిక ప్రభుత్వాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేశాయి.

భారత విదేశాంగ శాఖ గత నెలల్లో కూడా ఇలాంటి రక్షణ చర్యలు చేపట్టి.. 400 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చింది. ఈసారి జరిగిన ఆపరేషన్‌ను కూడా రిస్కు ఆపరేషన్ అని అధికారులు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో తీవ్రవాద గ్రూపులు, అనధికార సైనిక దళాలు చురుకుగా ఉంటాయి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బాధితులను రక్షించింది.

Advertisement

విమానంలో ఢిల్లీ చేరుకున్న 270 మంది బాధితులను కేంద్ర అధికారులు పరిశీలన తరువాత..  తెలంగాణకు చెందిన 12 మందిని విదేశాంగ శాఖ నేడు తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించనుంది. అక్కడి నుండి వారిని హైదరాబాద్‌కు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ బాధితులకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం.

Also Read: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

విదేశాంగ శాఖ అధికారులు యువతకు హెచ్చరిక జారీ చేస్తూ, విదేశీ ఉద్యోగ అవకాశాల పేరుతో వచ్చే నకిలీ ప్రకటనలపై నమ్మవద్దని  విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఆఫర్ వచ్చినా ఆఫిషియల్ చానెల్‌ల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని, నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను దూరంగా ఉంచాలని సూచించారు.

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×