E-Paper
Advertisement

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్
Advertisement

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ ప్రెస్ వేలపై వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. ఈ ప్రత్యేక డ్రైవ్ అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది.

పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లకు ఫెన్సింగ్

‘పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా 8 వారాల్లో తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లో మున్సిపల్ సిబ్బంది ఈ స్థలాలను, భవనాలను గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి రీ లొకేషన్ చేయాలి. వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వాటిని వదిలిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాలలో తనిఖీ చేయాలి. పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలి లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

మోడల్ అధికారి ఏర్పాటు

Advertisement

పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్ల ఆవరణల నుండి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ఆదేశాలపై పిటిషనర్, లాయర్ ననితా శర్మ మాట్లాడుతూ.. ‘అన్ని విద్య, ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుంచి వీధి కుక్కలను తొలగించి, వాటిని వేరే చోటకు తరలించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ సంస్థల్లో వీధి కుక్కలు లేకుండా ఉండేలా చూసుకోవడానికి ఒక మోడల్ అధికారిని నియమించనున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నోరులేని జంతువుల పట్ల అంత అన్యాయం జరగకూడదు’ అన్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×