PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా యూపీలోని లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రేరణ స్థల్లో బీజేపీ-జనసంఘ్లోని ముగ్గురు అగ్ర నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి, దీన్దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీల భారీ విగ్రహాలను ఆవిష్కరించారు. లక్నోలోని వసంత కుంజ్ ప్రాంతంలోని 65 ఎకరాల పార్క్ లో ఈ భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ.. మ్యూజియంను ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 గోడను కూల్చివేసే” అవకాశం రావడం బీజేపీ ప్రభుత్వానికి గర్వంగా ఉందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సృష్టించిన సుపరిపాలన ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రతి సానుకూల విజయాన్ని ఒకే కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రభుత్వ పథకాలు వివక్ష లేకుండా పేదలందరికీ చేరేలా చూడటం కోసం పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దార్శనికతను బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014కి ముందు, దాదాపు 25 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల కింద ఉన్నారని, నేడు ఈ సంఖ్య 95 కోట్లకు పెంచామని ఆయన అన్నారు.
Also Read: Atal Canteen: రూ.5కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా? ఇందులో వడ్డించే ఐటెమ్స్ ఇవే!