E-Paper
Advertisement

PM Modi : ఆ కంపెనీల సీఈవోలతో మోదీ మీట్.. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..

PM Modi : ఆ కంపెనీల సీఈవోలతో మోదీ మీట్.. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..

PM Modi us visit live updates(Latest breaking news in telugu) : భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా, అప్లైడ్‌ మెటీరియల్స్‌ సీఈవో గారీ ఈ డికర్సన్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌ సీఈవో లారెన్స్‌ కల్ప్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని మోదీ ఆహ్వానించారు.

భారత్‌లో అపార అవకాశాలున్నాయని మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ అన్నారు. మెమొరీ, స్టోరేజ్‌ విభాగంలో మైక్రాన్‌ గ్లోబల్‌ లీడర్‌ గా ఉందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, స్మార్ట్‌ఫోన్లు, పీసీలకు మెమొరీ పరికరాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ మేధ సేవలు అందిస్తున్నామని చెప్పారు. భారత్ ప్రధాని మోదీతో భేటీ బాగా జరిగిందన్నారు. దేశం కోసం మోదీ దార్శనికత అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. సెమీకండక్టర్ల తయారీ కోసం మైక్రాన్‌ టెక్నాలజీస్‌ను మోదీ ఆహ్వానించారని విదేశాంగశాఖ వెల్లడించింది.

భారత వైమానిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో జనరల్ ఎలక్ట్రిక్ కీలక పాత్ర పోషించాలని మోదీ కోరారు. భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అందించాల్సిన సాంకేతిక సహకారంపై ఆ సంస్థ సీఈవో లారెన్స్‌తో చర్చించారు.

మోదీతో భేటీ వివరాలను అప్లైడ్‌ మెటీరియల్స్‌ సీఈవో గారీ ఈ డికర్సన్‌ వెల్లడించారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారత్ లో అద్భుతమైన విజయం సాధించడానికి ఎదురు చూస్తున్నామని తెలిపారు. ప్రాసెస్డ్‌ టెక్నాలజీ, అత్యాధునిక ప్యాకేజింగ్‌ సామర్థ్యాలను పెంచేందుకు అప్లైడ్‌ మెటీరియల్స్‌ సంస్థ భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లోని విద్యాసంస్థలతో కలిసి ఆ కంపెనీ పనిచేసే అంశంపై చర్చించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×